హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తేతెలంగాణ) : గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బుధవారం గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ అనంతుల శ్యాంమోహన్ను కలిసి వివరణ లేఖను అందించారు.
నర్సారెడ్డిపై ఇటీవల సిద్దిపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నర్సారెడ్డి కూడా కొందరు నేతలపై ఫిర్యాదు చేయడంతో వారిని కూడా విచారణకు పిలుస్తామని మల్లు రవి వెల్లడించారు.