న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: పెద్ద మొత్తం యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి బుధవారం గట్టిగా సమర్థించారు. వ్యాపార సంస్థలు ప్రభుత్వ రాయితీలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించే మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు.
ప్రాచీన భారతీయ గురువు చాణక్యుడిని ఉటంకిస్తూ ఒక తేనెటీగ పువ్వు నుంచి సున్నితంగా, నెమ్మదిగా, రేకులకు నొప్పి కలిగించకుండా, వాటిని నలిపివేయకుండా తేనెను స్వీకరించినట్టుగా, ఒక పాలకుడు పౌరుల నుంచి పన్నులను వసూలు చేయాలని లాహిరి పేర్కొన్నారు. రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వ్యాపారాలను నిలబెట్టుకునే మార్గాలను మీరు కనుగొనాలని ఒక కార్యక్రమం సందర్భంగా విలేకరులతో లాహిరి అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని తెలిపారు.