హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్స్-2023 ఫలితాల్లో తమ విద్యాసంస్థల విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తాచాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ చెప్పారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో లోహిత్ ఆదిత్య సాయి 2వ ర్యాంకు, కౌషల్ విజయ్ వార్గేయ 5వ ర్యాంకు, సాయి దుర్గారెడ్డి ఎన్ 6వ ర్యాంకు సాధించారని తెలిపారు. అలాగే ఇతర విద్యార్థులు 12, 14, 25, 26, 30, 34, 38, 40, 45, 55, 57, 65, 66, 67, 69, 71, 72, 73, 80, 82, 85, 100 ర్యాంకులు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. వందలోపు 25 ర్యాంకులు, వెయ్యిలోపు 160 ర్యాంకులు పొందినట్టు వెల్లడించారు. ఆలిండియా అన్ని క్యాటగిరీల్లో 1, 1, 1, 1, 2, 3, 3, 4, 5, 5, 6, 6, 8, 9 వంటి పదిలోపు 14 ర్యాంకులు, వందలోపు 108 ర్యాంకులు సాధించినట్టు వివరించారు. దేశవ్యాప్తంగా 11 లక్షల మంది పోటీ పడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయ దుందుభి మోగించినట్టు వారు వెల్లడించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు సత్కరించారు.