హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాదర్బార్ను గవర్నర్ ఎలా నిర్వహిస్తారని, ప్రజాసమస్యలను ఏవిధంగా పరిష్కరించగలుగుతారని నిలదీశారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ గవర్నర్లు మోదీ వ్యక్తిగత అజెండాను అమలుచేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్లు కేంద్ర దళారులు, బ్రోకర్లుగా ఉండకూడదని హి తవు చెప్పారు. కేంద్ర క్యాబినెట్లో నేరస్థులున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించాలని చూశారని పేర్కొన్నారు. దేశాన్ని దోచుకొంటున్న అదానీ జోలికి ఎందుకెళ్లడం లేదని ప్రశ్నించారు.