హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-1లో నారాయణ విద్యాసంస్థ ఉత్తమ ఫలితాలు సాధించిందని సంస్థ డైరెక్టర్లు సింధూర, శరణి తెలిపారు. నారాయణ విద్యార్థి ఎన్కే విశ్వజిత్ 100 పర్సంటైల్ సాధించాడని వెల్లడించారు. హేమంత్రెడ్డి, రుత్విక్, జాయి ల్ టెన్ని, సాయిదుర్గారెడ్డి ఉత్తమ ఫలితాలు సాధించినట్టు ప్రకటించారు.
వీరితోపాటు 17 మంది విద్యార్థులు 99.99 పర్సంటైల్ సాధించారని తెలిపారు. ఆలిండియా బాలికల విభాగంలో రామిరెడ్డి మేఘన, తేజశ్రీ టాప్-10లో చోటు దక్కించుకొన్న ట్టు తెలిపారు. సబ్జెక్టులవారీగా 72 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారని చెప్పారు.తమ సంస్థ అనుసరిస్తున్న ప్రత్యేక విధానాలు, నిపుణులైన ఫ్యాకల్టీ, ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ఏర్పాటు చేసిన ఎన్-లర్న్ యాప్, ప్రత్యేక స్టడీ మెటీరియల్తో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వెల్లడించారు.