హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్1 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆల్టైమ్ రికార్డు సృష్టించారని నారాయణ గ్రూప్ డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ విద్యార్థులు ఎం సాయితేజ, షేక్ సూరజ్, ఆర్యన్ ప్రకాశ్, పీ రోహన్ సాయి, హెచ్ విదిత్, ఎం అనూప్ 300 మార్కులకుగాను 300 మార్కులు సాధించి, సత్తా చాటారని వెల్లడించారు. వివిధ సబ్జెక్టుల్లో 154 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించటం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా రూపుదిద్దిన ఎన్లెర్న్ యాప్ ద్వారానే ఈ విజయం సాధ్యమైందని వివరించారు.