హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్కు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. శనివారం ఢిల్లీ అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో సీఐడీ అధికారులు లోకేశ్ను కలిసి నోటీసులు అందజేశారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేరొన్నారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ 4న సీఐడీ విచారణకు హాజరుకానున్నట్టు తెలిపారు.