మెదక్ : బీజేపీ(BJP) పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్ధన్ రెడ్డి(Nandu Janardhan Reddy) తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం తన అనుచరులతో కలిసి మంత్రి కేటీఆర్(Minister KTR )సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ప్రగతి భవన్లో జరిగినే ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ గులాబీ కం డువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఈఎఫ్సీవో డైరెక్టర్ ఎం.దేవేందర్ రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి కంఠరెడ్డి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోడెంలా లక్ష్మణ్ యాదవ్, అందే కొండల్ రెడ్డి, జె .వెంకట్ రెడ్డి, టి.రమేష్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు