నందికొండ, అక్టోబర్ 15: రాష్ట్రంలోని ప్రసిద్ధ చారిత్రక బౌద్ధ ప్రాంతం నందికొండ అని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. హిల్కాలనీ విజయవిహార్లో ఉన్న అతిథి గృహ సముదాయంలోని పార్కులో ఏర్పాటు చేసిన మినీ బుద్ధవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. మహాబోధి బుద్ధ్ద విహారానికి చెందిన బుద్ధదత్త, సంఘపాల, ఆయుపాల సిద్ధార్ధ బౌద్ధ భిక్షువులతో కలిసి ఇక్కడ ఏర్పాటు చేసిన 12 అడుగుల బుద్ధ విగ్రహం వద్ద బుద్ధ వందనం చేసి ప్రత్యేక పూజలు చేశారు. మినీ బుద్ధవనంలో ఏర్పాటు చేసిన తార, గాంధార, బుద్ధశిల్ప ఫలకం, పంచముద్రలు తెలిపే బుద్ధుడి శిలా విగ్రహాలు, బోధిసత్వ, పద్మపాల శిల్పాలు, స్థూపారాధన శిలాఫలకాల గురించి బౌద్ధ భిక్షువులకు బౌద్ధ నిపుణుడు, పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ సుధాన్రెడ్డి, ఎస్ఈ క్రాంతిబాబు, సహాయక శిల్పి శ్యాం సుందర్, డీఈ దామోదర్రెడ్డి, ఏఈ నజీశ్, ఎల్లయ్య, చిత్రకారుడు లింగరాజు పాల్గొన్నారు.