హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 3: ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన ప్రాపర్టీషో గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
టీఎన్జీవో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, కార్యదర్శి బైరి సోమయ్య, కేంద్ర సంఘం నాయకులు శ్యాం సుందర్, రామునాయక్, జిల్లా నాయకులు రాజేశ్ఖన్నా, మల్లేశం, మహబూబ్, కుమార్, టీఎన్జీవో వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంకిషన్, కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ వీరగంటి రవీందర్ తదితరులతోపాటు ఎంతో మంది ప్రజలు ఈ స్టాళ్లను సందర్శించారు.
వివిధ ప్రాంతాల్లోని వెంచర్లు, అపార్ట్మెంట్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాల వివరాలతోపాటు వాటి కొనుగోలుకు బ్యాం కర్లు కల్పిస్తున్న రుణ సదుపాయాల గురించి తెలుసుకున్నారు. స్థిరాస్తుల కొనుగోలుకు ఎంతో ఉపకరిస్తున్న ఇలాంటి ప్రాపర్టీషోలను మళ్లీ మళ్లీ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ ప్రదర్శనను నిర్వహించిన ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈ ప్రాపర్టీషో నిర్వాహకులు లక్కీడ్రా ద్వారా పలువురు కస్టమర్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ‘నమస్తే తెలంగాణ’ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్కుమార్, బ్యూరో ఇంచార్జి పిన్నింటి గోపాల్, అడ్వైర్టెజ్మెంట్ డిప్యూటీ మేనేజర్ అప్పని సూరి తదితరులు పాల్గొన్నారు.