నమస్తే తెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవ వేడుకలను సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రిక సీఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు కేక్ కట్చేశారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేవరాజు చిరంజీవి సీఎండీకి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి, అడ్వర్టైజ్మెంట్ జనరల్ మేనేజర్ ఎన్ సురేందర్రావు, సీజీఎం ఆపరేషన్స్ సీహెచ్ శ్రీనివాస్, డీజీఎం సర్యూలేషన్ డీ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.