నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ వెంకటరమణ, నమస్తే తెలంగాణ ప్రకటన విభాగం జనరల్ మేనేజర్ సురేందర్ రావు, తదితర అతిథుల సమక్షంలో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవాళ, రేపు కొనసాగనుంది.
మొత్తం 22 స్టాళ్లు ఏర్పాటు చేయగా జాతీయ బ్యాంకులతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటోమొబైల్ సంస్థలకు చెందిన డీలర్లు ప్రదర్శనలో పాల్గొన్నారు. కొత్త తరం వాహనాలను పరిశీలించిన అతిథులు స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో నగరాలకు పరిమితమైన ఆటో షో లాంటి కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరానికి తీసుకువచ్చిన నమస్తే తెలంగాణ యాజమాన్యాన్ని కలెక్టర్, సీపీలు అభినందించారు.