మహబూబ్నగర్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు భూములు బంగారంలా మారాయని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ను దశదిశలా అభివృద్ధి చేసి స్థానికులను సంపన్నులను చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్లో ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో రెండో రోజు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు మహబూబ్నగర్ అంటే తాగునీటి కోసం కష్టాలు పడే పరిస్థితి ఉండేదని.. స్వరాష్ట్రంలో దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తూ వచ్చామని తెలిపారు. 2014కు ముందు మహబూబ్నగర్లో ఎకరం భూ మి రూ.10 లక్షలలోపు పలికేదని, నేడు కోట్ల విలువ చేస్తున్నాయని స్పష్టంచేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ద్వారా స్థిరాస్తులకు భారీగా విలువ పెరిగిందని చెప్పారు. మహబూబ్నగర్ చుట్టూ అద్భుతమైన రహదారుల నిర్మాణం, పట్టణానికి తలమానికం గా బైపాస్ రోడ్డు ఏర్పాటు, మినీ ట్యాంక్ బండ్, శిల్పారామం, నెక్లెస్ రోడ్డు, కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు పట్టణ స్థాయిని పెంచాయని అన్నారు. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) వల్ల ఈ ప్రాంతం హెచ్ఎండీఏ స్థాయిలో పురోగతి సాధించే వీలున్నదని చెప్పారు. పట్టణం వేగంగా అభివృద్ధి చెం దుతున్నది కాబట్టే హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని స్పష్టంచేశారు. వివిధ పరిశ్రమల స్థాపనకు సైతం పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. మహానగరంలో ఖ్యాతి గడిస్తుందన్నారు.
నమస్తే తెలంగాణకు మంత్రి అభినందనలు
ప్రాపర్టీ షోలో శ్రీరామ ల్యాండ్ మార్క్, సిరిసంపద గ్రూప్, గిరిధారి, దేవాస్ ఇన్ఫ్రా, కామాక్షి, ఎంవీపీ స్పెన్సర్స్, స్కంధాన్షి, రెయిన్ బో డెవలపర్స్, భాస్కర్ సిమెంట్స్, ఫార్చూన్ హెయిట్స్, శ్రీ సిమెంట్స్ వంటి సంస్థలతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, యూ బీఐ, కెనారా బ్యాంక్ తమ స్టాళ్లను ఏర్పాటుచేశాయి. అన్ని స్టాళ్లను సందర్శించి మంత్రి వివరాలు తెలుసుకొన్నారు. వినియోగదారుల నుంచి చక్కని స్పందన వచ్చిందని స్టాల్స్ యజమానులు మంత్రికి తెలిపారు. తొలిసారి ప్రాపర్టీ షో విజయవంతంగా నిర్వహించినందుకు నమస్తే తెలంగాణను మంత్రి అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రాపర్టీ షోలు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాపర్టీ షోను సందర్శించేందుకు వచ్చిన వారిలో లక్కీడిప్ ద్వారా ఎంపికైన విజేతలకు మంత్రి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జీఎం ఎన్ సురేందర్రావు, ఏజీఎం ఎం రాజిరెడ్డి, బీఎం రాజశేఖర్, బ్యూరో ఇన్చార్జి విజయభాస్కర్, ఎడిషన్ ఇన్చార్జ్జి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.