హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కేంద్ర వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. అభిషేక్ మను సంఘ్వీ చైర్మన్గా ఉండే ఈ కమిటీలో రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు, లోక్సభ నుంచి 31 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంటరీ కమిటీల్లో వాణిజ్య కమిటీకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది.