Nallagonda | నల్లగొండ : తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వ్యవసాయానికి సాగు నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎండిపోతున్న పంటలను చూసి తల్లడిల్లిపోతున్నారు. అలా రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
నల్లగొండ జిల్లాలోని రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పొట్టకొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు కేశరాజుపల్లి రైతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో.. కిరాయి నీటి ట్యాంకర్లను తీసుకొచ్చి పొలాలకు నీరు పారిస్తున్నారు. అయినా కూడా పొలం మొత్తం నీరు పారడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో తమకు కష్టాలు వచ్చాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి సరిపడా నీరు ఇవ్వని ప్రభుత్వం ఎందుకు అంటూ రైతులు కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.