నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన క్రాంతికిరణ్ (24) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదయఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి – అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు చంద్రకాంత్రెడ్డి, క్రాంతికిరణ్రెడ్డి ఉన్నారు. ఇద్దరు ఎమ్మెస్ చదివేందుకు వెళ్లి.. ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నారు.
ఈ క్రమంలో కాంత్రికిరణ్రెడ్డి వీకెండ్ సందర్భంగా మిత్రులతో కలిసి బయటకు వెళ్లాడు. నలుగురు మిత్రులతో కలిసి కారులో వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఘటనలో కాంత్రికిరణ్ మృతి చెందగా.. అతని ముగ్గురు స్నేహితులు కోమాలోకి వెళ్లారు. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించి అమెరికా నుంచి సమాచారం అందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు.