నల్లగొండ: నల్లగొండలోని నాగార్జున కళాశాల వద్ద స్వచ్ఛభారత్ స్వచ్ఛ మిషన్.. ఫిట్ ఇండియా 2k రన్ను నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం నల్లగొండ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ( MLA Bhoopal Reddy ) జెండా ఊపి ప్రారంభించారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ నేటి సమాజంలో అవసరాలని ఎమ్మెల్యే అన్నారు. పర్యావరణ కాలుష్యం వల్ల ప్రస్తుతం స్వచ్ఛమైన గాలి పీల్చుకునే పరిస్థితులు లేవని ఆయన పేర్కొన్నారు.
నెహ్రూ యువ కేంద్రం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం రావాలని, ముఖ్యంగా యువతను చైతన్యవంతం చేయాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సూచించారు. ఈ 2కె రన్ కార్యక్రమంలో రెడ్ క్రాస్ అధ్యక్షులు గోలి అమరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నేత పిల్లి రామరాజు యాదవ్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, రావుల శ్రీనివాస్ రెడ్డి, గంజి రాజేందర్, DSP వెంకటేశ్వర్ రెడ్డి, నెహ్రూ యువ కేంద్రం అధికారులు తదితరులు పాల్గొన్నారు.