హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నాగోల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రౌడీషీటర్ నయీమ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జేకే మహేశ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఆయన కుమారుడు యుగంధర్కు అనుచరుడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. దీపాదాస్మున్షీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న సమయంలో మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో మహేశ్ కాంగ్రెస్లో చేరారు.
కాంగ్రెస్ నేత మువ్వా విజయ్బాబుతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిసింది. మహేశ్ వీరందరితో ఉన్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ మారాయి. అతను కాంగ్రెస్ నేతలతో కలిసి పలు సెటిల్మెంట్లు చేశారని మల్కాజిగిరి పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితులు ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అనే స్టిక్కర్తో ఉన్న వాహనంలో వచ్చి నయీమ్ను కత్తులతో పొడిచి, పెనంతో చితకబాది హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.