నాగోబా మహాజాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో నాగోబాకు మెస్రం వంశీయులు శుక్రవారం అర్ధరాత్రి మహాపూజలు చేసి జాతరను ప్రారంభించారు. మెస్రం వంశీయులతోపాటు ఆదివాసీ గిరిజన భక్తజనంతో నాగోబా ఆలయం కిక్కిరిసిపోయింది. అర్ధరాత్రి వరకు సంప్రదాయ ప్రత్యేక పూజలు చేశారు.
ముందుగా మైసమ్మ దేవతకు, ఆ తర్వాత నాగోబాదేవత, సతీదేవత, బాన్దేవతలకు పూజలు చేశారు. ఈ పూజలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ నగేశ్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో ఖుష్పు గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం పాల్గొన్నారు.
– ఇంద్రవెల్లి