నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 4.24 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3.8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలు, విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 40 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. సాగర్లో ప్రస్తుతం 588 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. జలాశయంలో గరిష్టంగా 312.04 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు 306.10 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.