హైదరాబాద్, అక్టోబరు 9 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఐదు రాష్ర్టాల ఎన్నికలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
నవంబర్ 7 నుంచి 30వ తేదీ వరకు ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3వ తేదీన అన్ని రాష్ర్టాల ఓట్లను ఒకేసారి లెక్కిస్తారు. మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించనుండగా ఛత్తీస్గఢ్ ఎన్నికలను మాత్రం రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి దశలో 20 స్థానాలకు, రెండో దశలో 70 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ర్టాల్లోనూ ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.