విద్యానగర్/గంభీరావుపేట, ఫిబ్రవరి 10: దక్షిణ భారత సహకార రం గానికి అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎన్సీడీసీ), బ్యాంకర్స్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (బీఐఆర్డీ) గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు వరుసగా రెండోసారి నామినేట్ అయ్యారు.
కేంద్రహోం, సహకార శాఖ మంత్రి అమిత్షా నేతృత్వం లో ఎన్సీడీసీ వివిధ రకాల రుణాలు, వ్యవసాయం, అనుబంధ రంగాల వారు ఆర్థిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి సహకారం అందిస్తుందని రవీందర్రావు తెలిపారు. బీఐఆర్డీ గ్రామీణ సహకార రంగం, వాణిజ్య బ్యాంకుల ఉద్యోగులకు శిక్షణ, సామర్థ్యం పెంపొందించడానికి పనిచేస్తుందని కొండూరి చెప్పారు.