హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వంపై నాబార్డ్ ఉద్యోగులు పోరుబాటపట్టారు. వేతన సవరణ చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా నాబార్డ్ కార్యాలయాల ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. ఇందులోభాగంగా హైదరాబాద్లోని నాబార్డ్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసనకు దిగారు. 1982లో రిజర్వ్బ్యాంక్ నుంచి నాబార్డ్ ఏర్పడినప్పుడు నాటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు వేతన సవరణ చేయాలని కేంద్రసర్కారును డిమాండ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల మాదిరిగానే తమకూ వేతన సవరణ చేయాలని కోరారు. కమర్షియల్ బ్యాం కు ఉద్యోగుల తరహాలో జీతాలిస్తే ఊరుకోబోమని మోదీ సర్కారును హెచ్చరించారు.