తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తన కుటుంబానికి రెండు సీట్ల కోసం పట్టుబట్టి అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిన మైనంపల్లి హనుమంత రావుతోపాటు ఆయన కుమారుడు మైనపంల్లి రోహిత్ ఓట్లు సాధించడంలో మాత్రం వెనుకబడిపోయారు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్లోకి వెళ్లి మరీ మల్కాజిగిరి, మెదక్ సీట్లలో పోటీకి దిగిన తండ్రీ కొడుకులపై అధికార పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
మల్కాజిగిరిలో హన్మంతరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం 5500కుపైగా ఓట్లతో లీడ్లో ఉండగా, మెదక్లో మైనంపల్లి రోహిత్పై ప్రస్తుత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి 1362 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.