కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 1: పేదలకు అండగా ఉంటున్న సినీనటుడు సోనూసూద్కు ఓ చిరువ్యాపారి తనవంతు సహాయం అందిం చాడు. కరీంనగర్లోని ఆదర్శనగర్కు చెందిన మటన్ వ్యాపారి మిర్యాల్కర్ బాలకన్నయ్య మార్కెట్లో కిలో మటన్ రూ.700 ఉండగా.. రూ.650కే విక్రయిస్తున్నారు. అదీగాక అందు లోనుంచి మరో రూ.50ని సోనూసూద్ ట్రస్టు కు విరాళంగా అందిస్తున్నారు. దీనికోసం మట న్షాపులో ఓ హుండీ ఏర్పాటుచేశారు. కస్టమర్లు కూడా తమకు తోచిన మొత్తాన్ని ఈ హుండీలో వేయవచ్చని కోరుతున్నారు.