హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ముస్లిలు గురువారమే పవిత్ర రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ అరేబియా ప్రకటించింది. నెలవంకను ప్రారంభసూచికంగా భావించే ముస్లింలు ముగింపును సైతం నెలవంక దర్శనంతోనే పాటించడం ఆనవాయితీ. మార్చి 12 నుంచి ప్రారంభమైన ఉపవాస దీక్షలను ముస్లింలు నేటితో ముగించి, ఈద్-ఉల్-ఫితర్ను నిర్వహించనున్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే అన్ని ప్రముఖ మసీదుల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.