కమలాపూర్, సెప్టెంబర్ 30: అన్ని వర్గాల ప్రజల ఆదుకొనేందుకే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నదని విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కమలాపూర్ టీఆర్ఎస్ కార్యాలయంలో దివ్యాగుల ఆత్మీయ సమ్మేళనం, ఉప్పల్లో ముస్లింల ఆత్మీయ సమ్మేళనం, గౌడ కులస్థులు, ఉప్పలపల్లి, గుండేడు గ్రామాల్లో పర్యటించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ శుక్రవారం నుంచి చేపట్టే ప్రచార కార్యక్రమ వివరాలను గ్రామస్థులకు వివరించారు. ఉప్పల్లో ముస్లింలు టీఆర్ఎస్ పార్టీకే సంపూర్ణ మద్దతు ప్రకటించి తీర్మానం పత్రాన్ని బాల్క సుమన్కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎండీ అజ్మతుల్లా టీఆర్ఎస్లో చేరగా, సుమన్ గులాబీ కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు, దళితబంధు వంటి పథకాలు ప్రవేశపెట్టి పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకొంటున్నదని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఎదిగినట్టు వెల్లడించారు. ప్రభుత్వం సంక్షేమంతోపాటు అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఇంచార్జి డాక్టర్ పేర్యాల రవీందర్రావు, సర్పంచ్ దేవేందర్రావు, ఎంపీటీసీ సంపత్రావు, మండల కో ఆప్షన్ సభ్యుడు చోటేమియా, పార్టీ
రాష్ట్ర నాయకుడు స్వర్గం రవి, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.