నెక్కొండ, మే 25: బొడ్రాయి పునఃప్రతిష్ఠ కోసం వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ముస్లింలు రూ.50 వేల విరాళం అందజేసి మతసామరస్యాన్ని చాటుకొన్నారు. నెక్కొండలో గ్రామస్థులు బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని చేపట్టారు.
గ్రామ దేవతల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు మసీద్ కమిటీ చైర్మన్ హమీద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్దుల్నబి ఆధ్వర్యంలో ముస్లింలు ముందుకొచ్చారు. ఈ మేరకు విరాళం మొత్తాన్ని బొడ్రాయి కమిటీ ప్రతినిధులు సర్పంచ్ సొంటిరెడ్డి యమున, పీఏసీఎస్ చైర్మన్ మారం రాముకు అందజేశారు.