హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని శుక్రవారం సచివాలయంలో మాజీ మంత్రి షబ్బీర్అలీ ఆధ్వర్యంలో పలువురు ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు ప్రత్యేకంగా కలిశారు. సీఎంకు అభినందనలు తెలిపి, సన్మానించారు. అనంతరం మైనార్టీల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేశారు. సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు శివధర్రెడ్డి, షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.