హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో శ్రీనివాస్ మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా విరివిగా చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లకుండా చెట్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని, మనల్ని మనమే సంరక్షించుకోవాలన్నారు. పచ్చదనం పెంపు కోసం పర్యావరణ పరిరక్షణకై ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ చాలెంజ్ ప్రతి ఒక్కరు స్వీకరించి మొక్కలు నాటాలని వందేమాతరం శ్రీనివాస్ కోరారు.