ఖమ్మం జిల్లా ఎన్వీ బంజరలో విషాదం
రఘునాథపాలెం, అక్టోబర్ 12: మద్యం మత్తులో ఉన్న ఓ ఇద్దరు వ్యక్తులు వంద రూపాయల కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒకరి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల ఎన్వీ బంజరలో చోటుచేసుకున్నది. రఘునాథపాలెం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని బాలఘడ్ జిల్లాకు చెందిన 20మంది ఎన్వీ బంజరలో మిర్చి తోటల్లో పనిచేసేందుకు వలస వచ్చారు. వీరు అజ్మీరా సంపత్ అనే రైతు తోటలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి దురువే దయాళ్ (30) అనే వ్యక్తి రైతు అజ్మీరా సంపత్ వద్దకు వెళ్లి రూ.100 కూలీ తీసుకొచ్చాడు. తన కూలీ డబ్బులు ఎందుకు తెచ్చావంటూ సేత్రాం అభ్యంతరం తెలిపాడు. ఈ దశలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన సేత్రాం.. కూరగాయల కత్తితో దయాళ్ గుండెలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన దయాళ్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు నిందితుడు సేత్రాంను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు.