హైదరాబాద్ : భవిష్యత్లో మునుగోడును కోనసీమగా తయారు చేస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులు మంత్రులుగా పని చేశారు. కానీ సాగు, తాగునీటికి కష్టాలు తప్పలేదు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సాగునీటి, జానారెడ్డి తాగునీటి మంత్రిగా పని చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రులుగా పని చేశారు.
పక్కన కృష్ణా నది పారుతున్న సాగు, తాగునీరు ఇవ్వలేదు. ఫ్లోరోసిస్ తో బాధ పడినప్పటికీ పట్టించుకోలేదు. నక్కలగండి, డిండి ప్రాజెక్టు కావాలనే డిమాండ్ ఉంది. కానీ ముందుకు పోలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక మునుగోడులో రెండు రిజర్వాయర్లకు బీజం పడింది. శివన్నగూడెం – చర్లగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయి. 70 శాతం పనులు పూర్తయ్యాయి. రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబబోతున్నాం. ఒక ఎకరం బీడు భూమి కూడా ఉండదు. మునుగోడును కోనసీమగా తయారు చేస్తామని కేటీఆర్ చెప్పారు.