చౌటుప్పల్: మునుగోడు బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అడుగడుగున నిరసన సెగ తగులుతున్నది. ప్రచారం నిమిత్తం నియోజకవర్గంలో తిరుగుతున్న ఆయనకు నిలదీతలు, అడ్డుకోవడాలు సర్వ సాధారణంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి కూడా అదే అనుభవం ఎదురయింది. మాజీ మంత్రి డీకే అరుణతో కలిసి కోమటిరెడ్డి సతీమణి చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు లక్ష్మిని అడ్డుకున్నారు.
లక్ష్మి గో బ్యాక్.. బీజేపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గత ఎన్నికల సందర్భంగా గ్రామాభివృద్ధికి ఇచ్చిన మాటను విస్మరించారని నిలదీశారు. టీఆర్ఎస్పై విమర్శలు చేయబోయిన డీకే అరుణపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేంలేక వారు తమ ప్రచారాన్ని ముగించుకుని అక్కడినుంచి వెనుతిరిగారు. పోలీసులు జోక్యంచేసుకుని పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు.