Munugode by poll Results | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 686 పోల్ అయ్యాయి. టీఆర్ఎస్కు 228, బీజేపీకి 224, బీఎస్పీకి 10, ఇతరులకు 88 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న గిడ్డంగులశాఖ గోడౌన్లో లెక్కింపు కొనసాగుతోంది. విశాలమైన కౌంటింగ్ హాల్లో మొత్తం 21 టేబుళ్లపై ఏకకాలంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉన్న మునుగోడు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తి కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలు ఈనెల 3న జరగగా, రికార్డు స్థాయిలో 93.13శాతం పోలింగ్ నమోదైంది. 2,41,805 ఓట్లకుగాను మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయి.
మునుగోడు ఓటర్లు ఢిల్లీ బాస్లకు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మునుగోడు చైతన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు ఎన్నికల్లో బీజేపీ వ్యవహార శైలిపై మండిపడ్డారు. గెలుపులో కీలకపాత్ర పోషించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషిచేసిన సీపీఐ, సీపీఎం శ్రేణులకు కూడా మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీజేపీ తీరును ఎండగడుతూ ఆయన మండిపడ్డారు.
కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన మునుగోడు ప్రజలకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం కృతజ్ఞతలు తెలిపాయి. రాజగోపాల్రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయి.. కమ్యూనిస్టులు అమ్ముడు పోయారంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని సీపీఐ, సీపీఎం పార్టీల నల్లగొండ జిల్లా కార్యదర్శులు నెల్లికంటి సత్యం, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి విమర్శించారు. పదవులు, కాంట్రాక్టుల కోసం అధికార పార్టీల్లోకి పోవడం కమ్యూనిస్టుల చరిత్రలోనే లేదని వారు తెలిపారు. కాసుల కోసం కాషాయం కండువా కప్పుకున్న రాజగోపాల్రెడ్డికి కమ్యూనిస్టుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని వారు మండిపడ్డారు.
మునుగోడులో ఆఖరిది అయిన 15వ రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తయ్యింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 15వ రౌండ్లో టీఆర్ఎస్కు 1270 ఓట్లు రాగా, బీజేపీకి 1358 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచి దాదాపు అన్ని రౌండ్లలో వెనుకంజలో ఉన్న బీజేపీ ఆఖరి రౌండ్లో కేవలం 88 ఓట్ల స్వల్ప ఆధిక్యం పొందింది.
14వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 10వేలకు పైగా మెజారిటీని సాధించింది. 14వ రౌండ్లో టీఆర్ఎస్ 6608, బీజేపీ 5553 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 1055 ఓట్ల లీడ్ రాగా.. ఓవరాల్గా 10094 ఓట్ల మెజారిటీని సాధించింది.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. అన్ని మండలాల్లోనూ కారు దూసుకెళ్లింది. అయితే గట్టుప్పల్ ప్రజలు ఆ ఉప్పలగట్టు వీరభద్ర స్వామి సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపారు. గట్టుప్పల్ మండల పరిధిలోని మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్కే పడ్డాయి. నేతన్నల ఓట్లన్నీ గంపగుత్తగా కారు గుర్తుకు పడ్డాయి. చేనేతకు మరణ శాసనం రాసిన మోదీకి నేతన్నలు గట్టిగా సమాధానం చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కనీసం డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయింది. 15 రౌండ్లలో ఏ ఒక్క రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించలేదు. మొదటి నుంచి చివరి రౌండ్ వరకు మూడో స్థానంలోనే ఉండిపోయింది. పాల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోవాలంటే 37,532 ఓట్లు రావాలి. కానీ అన్ని ఓట్లు రాలేదు. కేవలం 21 వేల పైచిలుకు ఓట్లే స్రవంతికి పోలయ్యాయి.
రైతుల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పని చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేండ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, పండించిన పంటలకు గిట్టుబాటుధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించింది .రైతులతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నార’ని పేర్కొన్నారు.
13 రౌండ్లు ముగిసేసరికి 9136 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. 13వ రౌండ్లో టీఆర్ఎస్ 6691, బీజేపీ 5406 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1285.
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖరారు కావడంతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇంటిబాట పట్టారు. రౌండ్లవారీగా టీఆర్ఎస్కు ఆధిక్యం వస్తుండటంతో నైరాశ్యంలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓటమిని అంగీకరిస్తున్నా అని చెప్పారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం వైపు దూసుకువెళ్తున్నారు. రౌండ్ రౌండ్కు టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం పెరుగుతున్నది. 12వ రౌండ్లు ముగిసేసరికి 7,801ఓట్ల ఆధిక్యం టీఆర్ఎస్ అభ్యర్థికి లభించింది. ఈ రౌండ్లో 7,448 ఓట్లు, బీజేపీకి 5,448 ఓట్లు , కాంగ్రెస్కు 1828 ఓట్లు లభించాయి.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో తెలంగాణ భవన్ వద్ద కోలాహలం కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా కాసేపట్లో తెలంగాణ భవన్కు చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రెస్మీట్లో మాట్లాడనున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకెళ్తున్న నేపథ్యంలో మంత్రి హరీశ్రావు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కేసీఆర్ వెంటే తెలంగాణ ఉందంటూ మంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు ఓ ఫోటోను కూడా ట్వీట్ చేశారు.
#TelanganaWithKCR 🙏 pic.twitter.com/x3YCjCDH1e
— Harish Rao Thanneeru (@trsharish) November 6, 2022
మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సవాలుగా తీసుకున్నప్పటికీ.. అధికార పార్టీ దెబ్బకు అతలాకుతలమయ్యాయి. అధికార పార్టీని అందుకోలేకపోయాయి. బీజేపీ రెండో స్థానంలో, కాంగ్రెస్ మూడో స్థానంలో ఉండిపోయాయి. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు బోసి పోయాయి. ఆ పార్టీ కార్యాలయాల్లో నేతలు ఎవరూ లేరు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ముందుకు రావడం లేదు. ముఖం చాటేస్తున్నారు. కేవలం మీడియాతో ఫోన్ ఇన్ లోనే మాట్లాడుతున్నారు తప్ప.. బయటకు రావడం లేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. సిట్టింగ్ స్థానమైన మునుగోడును నిలబెట్టులేకపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ గెలువలేకపోయింది. దుబ్బాక, హుజుర్నగర్, హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు తాజాగా జరిగిన మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. అధికార పార్టీకి కనీసం పోటీని కూడా ఇవ్వలేకపోయింది. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రచారాన్ని మునుగోడు ప్రజలు నమ్మలేదు. కేసీఆర్కే పట్టం కట్టారు. రెండో రౌండ్ ఫలితం వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. గెలుస్తామనే ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో కకావికలమైంది. ఊహించిన ఓట్లు కూడా పోల్ కాలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం దాదాపు ఖరారు కావడంతో కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. తెలంగాణ భవన్ వద్దకు చేరుకుని టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలుచేసుకుంటున్నారు.
11వ రౌండ్లోనూ కారు జోరు కనబరిచింది. 11వ రౌండ్లో టీఆర్ఎస్ 7214, బీజేపీ 5853 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్ 1358 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఓవరల్గా లీడ్ 5801 ఓట్లు.
వరుస రౌండ్లలో ఆధిక్యంతో టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. పదో రౌండ్లో 484 ఆధిక్యం సాధించింది. 10వ రౌండ్లో టీఆర్ఎస్ 7499, బీజేపీ 7015 ఓట్లు సాధించాయి. ఓవరల్గా టీఆర్ఎస్ 4416 ఆధిక్యంలో ఉంది.
తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 3923 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 9వ రౌండ్లో టీఆర్ఎస్ 7497, బీజేపీ 6665 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 832 ఓట్లు
ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 3104 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 8వ రౌండ్లో టీఆర్ఎస్ 6620, బీజేపీ 6088, కాంగ్రెస్ 907 ఓట్లు సాధించాయి.
రౌండ్ రౌండ్కీ టీఆర్ఎస్ ఆధిక్యం పెరుగుతోంది. ఏడో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 2568 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్లో టీఆర్ఎస్కు 7202, బీజేపీకి 6803, కాంగ్రెస్కు 1664 ఓట్లు వచ్చాయి.
ఎన్నికల కమిషన్పై బీజేపీవి చిల్లర రాజకీయాలు అని టీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. కౌంటింగ్హాలులో ప్రతి టేబుల్పై బీజేపీ ఏజెంట్లు ఉన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ది ధర్మబద్దమైన గెలుపు అని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రకు మునుగోడు ప్రజలు బ్రేక్ చేశారని అన్నారు. రూ.18వేల కాంట్ట్రార్కు మునుగోడు ఫలితం చరమగీతం కానుందని తెలిపారు. చిల్లర ప్రయత్నాలతో బీజేపీ మైండ్గేమ్ ఆడేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు.
ఎన్నిక కౌంటింగ్ అవ్వకముందే బీజేపీ నేతలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఎందుకు ఆలస్యమవుతుందని మేమూ అడుగుతున్నం.. కౌంటింగ్ పూర్తికాకముందే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఓడిపోతుంది కాబట్టే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు.
ఆరో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 2169 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఆరో రౌండ్లో టీఆర్ఎస్కు 6016, బీజేపీకి 5378, కాంగ్రెస్కు 12025 ఓట్లు వచ్చాయి.
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న బీజేపీ నాయకులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ను బెదిరించి బీజేపీ గెలవాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ లీడ్లో ఉంది. దాన్ని జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను గందరగోళ పరుస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ విధానాలను మానుకోవాలని బీజేపీ నాయకులను జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి స్వగ్రామం లింగంవారిగూడెంలో 340 ఓట్ల లీడ్ సాధించింది.
మునుగోడులో కారు పార్టీ దూసుకెళ్తున్నది. మొదటి రౌండ్ నుంచి ప్రత్యర్థి పార్టీలపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఐదు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీ 1430 ఓట్లతో ముందంజలో ఉన్నది. దీంతో బీజేపీ అభ్యర్థి నైరాశ్యంలో కూరుకుపోయారు. తనకు పూర్తిగా పట్టున్న చౌటుప్పల్ మండలంలో అనుకున్నంతగా ఓట్లు పోలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఓట్లు మాత్రం రాలేదని చెప్పారు. మండల ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపడంతో నిరాశలో మునిగిపోయారు.
ఐదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 1535 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఐదో రౌండ్లో టీఆర్ఎస్కు 32505, బీజేపీకి 309754, కాంగ్రెస్కు 10063 ఓట్లు పోలయ్యాయి.
మునుగోడులో ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆ పార్టీకి కేవలం 8200 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లపై సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళీ మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 2018లో బీజేపీకి కేవలం 12000 ఓట్లు మాత్రమే పోలయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడేమో ఆ పార్టీకి నాలుగు రౌండ్లకే 25 వేల ఓట్లు దాటయాంటే అది కేవలం రాజగోపాల్ రెడ్డి ప్రభావం మాత్రమే అని స్పష్టం చేశారు. అది కమలం పార్టీ బలం కాదని చెప్పారు. మునుగోడు కమ్యూనిస్టుల క్షేత్రం. అలాంటి మునుగోడులో బీజేపీ ఓట్లు పడటం కష్టమని చెప్పుకొచ్చారు.
ఐదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 1631 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఐదో రౌండ్లో టీఆర్ఎస్కు 6162, బీజేపీకి 5245 ఓట్లు వచ్చాయి.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఏ పాల్.. నోటాకు పోలైన ఓట్లతో పోటీ పడుతున్నారు. తొలి, రెండో రౌండ్లో కేఏ పాల్కు 34, 35 ఓట్లు పోల్ కాగా, నోటాకు 29, 53 ఓట్లు పోలయ్యాయి. కేఏ పాల్కు పోలైన ఓట్ల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉప ఎన్నిక ప్రచారంతో పాటు పోలింగ్ రోజున కేఏ పాల్ హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. గెలుపు నాదే అంటూ ఉరుకులు, పరుగులు పెట్టిన విషయం విదితమే.
చౌటుప్పల్ మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం నాలుగు రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ 613 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి, నాలుగో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ సాధించింది. ప్రస్తుతం నారాయణపురం మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు.
నాలుగు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు టీఆర్ఎస్కు 26443, బీజేపీకి 25729, కాంగ్రెస్కు 7380 ఓట్ల పోలయ్యాయి.
మూడో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 99 ఓట్లతో ముందంజలో ఉంది. మూడో రౌండ్లో టీఆర్ఎస్కు 7010, బీజేపీ 7426, కాంగ్రెస్కు 1532 ఓట్లు పోలయ్యాయి.
రెండు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 515 ఓట్ల ( పోస్టల్ బ్యాలెట్తో కలిపి ) ఆధిక్యంలో ఉండగా.. మూడో రౌండ్ ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
తొలి రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ 1352 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్లో బీజేపీ 841 ఓట్ల లీడ్లో ఉంది. మొత్తంగా రెండు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 515 ఓట్ల ( పోస్టల్ బ్యాలెట్తో కలిపి ) ఆధిక్యంలో ఉంది.
తొలి రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ 1352 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్లో బీజేపీ లీడ్లో ఉంది. బీజేపీకి 789 ఓట్ల పైచిలుకు లీడ్లో ఉంది.
తొలి రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 1352 ఓట్ల ఆధిక్యంతో కారు దూసుకుపోతోంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్ 6478, బీజేపీ 5126, కాంగ్రెస్కు 2100 ఓట్లు పోలయ్యాయి.
పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల ఫలితాలు ఇలా ఉన్నాయి. మొత్తం 686 ఓట్లు పోల్ అయ్యాయి. టీఆర్ఎస్కు 228, బీజేపీకి 224, బీఎస్పీకి 10, ఇతరులకు 88 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి పోలింగ్ కేంద్రం జై కేసారంలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మొదటి రౌండ్లో చౌటుప్పల్ మండల పరిధిలోని పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు.
మునుగోడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది.