ఖైరతాబాద్, జూలై 7: మున్నూరుకాపు ప్రజాప్రతినిధుల సన్మాన సభ 9న నిర్వహిస్తున్నట్టు తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు కాచిగూడలోని మున్నూరుకాపు భవన్లో సభ ప్రారంభమవుతుందన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సన్మాన సభ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు.