బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 17 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన 60 మున్నూరు కాపు కుటుంబాల వారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆదివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ను కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పీకర్ పోచారం ప్రత్యేక కృషితోనే బోర్లం గ్రామం అభివృద్ధి చెందిందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తామంతా కారు గుర్తుకు ఓటు వేసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని గెలిపించుకుంటామని వారు ముక్తకంఠంతో నినదించారు.