రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీ ప్రవీణ్కుమార్ ఏసీబీ వలకు చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఆయనకు సంబంధించిన ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు రూ.3.3 కోట్ల వరకు అక్రమ ఆస్తులను గుర్తించారు. భార్య పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు కనుగొన్నారు.
భార్య పేరుతో రియల్ ఎస్టేట్, కోల్డ్ స్టోరేజీ, లగ్జరీ చీరల వ్యాపారం చేసినట్లు గుర్తించారు. ఆస్తులన్నీ బినామీ పేర్లపైనే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయన ఇంట్లో వాడని 73 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రవీణ్కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన పీఏ అంజన్నతోపాటు డ్రైవర్ యూసుఫ్ను అదుపులోకి తీసుకున్నారు.