ములుగు: ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI)లో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలకు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2017 బ్యాచ్కి చెందిన 48 మంది బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రతిభా పురస్కారాలు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బంగారు పథకం అందించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ శోభ, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ లక్ష్మీ నారాయణ, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ నీరజ ప్రభాకర్, ఫారెస్ట్ కాలేజ్ డీన్ ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు.