ఉమ్మడి రాష్ట్రంలో పల్లెతల్లి జీవచ్చవంలా గోచరించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రగతి బాటలో ప్రతి పల్లె జీవం పోసుకొని, గ్రామస్వరాజ్యం దిశగా పయనిస్తున్నది. వెలుగు కాంతుల పల్లెకు ప్రత్యక్ష ఉదాహరణే కేంద్ర, రాష్ట్ర అవార్డులు అందుకొన్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామం. 2014కు ముందు ఎడారిని తలపించిన ఈ గ్రామం.. నేడు సజీవ పల్లెచిత్రంగా కనిపిస్తున్నది.
ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం ట్విట్టర్ ద్వారా ముక్రా (కే) పంచాయతీని అభినందించారు. పల్లె ప్రగతితో ముక్రా (కే) గ్రామ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయంటూ ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేసి ప్రశంసించారు. – ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్/ఇచ్చోడ