హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా చేసిన ప్రకటన వ్యాక్సిన్ తీసుకున్న వారిని భయాందోళనలకు గురి చేస్తున్నది. తమ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో దుష్ప్రభావాలు (సైడ్ఎఫెక్ట్స్) వస్తున్న మాట నిజమేనంటూ ఆస్ట్రాజెనికా కంపెనీ న్యాయస్థానం ముందు అంగీకరించింది. స్వయంగా కంపెనీనే న్యాయస్థానం ముందు తమ కంపెనీలో తయారైన టీకాతో దుష్ప్రభావాలు ఉన్నాయని, ఇది తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్లు తగ్గడం వంటి సమస్యలను గుర్తించినట్టు చెప్పింది. దీంతో ఇప్పుడు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది. అయితే, కొవిషీల్డ్ గురించి ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని హైదరాబాద్కు చెందిన ప్రముఖ గుండెవ్యాధుల వైద్యుడు ఎంఎస్ఎస్ ముఖర్జీ చెప్తున్నారు.
కరోనా సమయంలో ఆయన వైద్య సలహాలు, జాగ్రత్తలు చెప్తూ ఎందరికో సాయపడ్డ సంగతి తెలిసిందే. కొవిషీల్డ్ వ్యాక్సిన్పై ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే చాలని ఆయన చెప్తున్నారు. అయితే, వ్యాక్సిన్పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే తాను ప్రయత్నిస్తున్నానని, కొవిషీల్డ్ వ్యాక్సిన్పై న్యాయస్థానాలు చెప్పే తీర్పు, వాటి పరిశీలనే అంతిమమని డాక్టర్ ముఖర్జీ పేర్కొన్నారు.
జవాబు: టీకా తీసుకుంటే రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది. ఇదేమీ కొత్తగా వచ్చిందో, కొత్తగా చెప్తున్నదేమీ కాదు. దీని గురించి ఇంటర్నెట్లో కావాల్సినంత సమాచారం ఉన్నది. ఇలా వచ్చే సమస్యకు, రోగానికి ఒక పేరు కూడా ఉన్నది. దీన్ని ‘వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ త్రోంబోటిక్ త్రోంబోసైటోపేనియా’ అని అంటారు. ఇదేమీ రహస్యం కాదు.
జవాబు: ఇది సరికాదు. ఆస్ట్రాజెనికా తమ వ్యాక్సిన్ గురించి క్షుణ్ణంగా వ్యాక్సిన్తో పాటే ఇచ్చే వివరణ కాగితంలో పొందుపరిచింది. దాన్ని చదివితే రక్తం గడ్డ కట్టడం గురించి ఉంటుంది. 2021 ఫిలిఫ్పిన్స్ ఎఫ్డీఏ రూపొందించిన వ్యాక్సిన్ మార్గదర్శకాలను వివరిస్తూ ఇచ్చిన వివరణ కాగితంలో ఇది ఉన్నది.
జవాబు: వ్యాక్సిన్ తీసుకున్న అందరికీ సమస్యలు వస్తాయన్నది అపోహ మాత్రమే. ప్రతీ పది లక్షల మందిలో ముగ్గురి నుంచి 15 మందికి ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది. అంటే మన దేశంలో వంద కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకుంటే అతి తక్కువ మందికే వచ్చే ప్రమాదం ఉంటుంది.
జవాబు: వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత నాలుగు నుంచి 30 రోజుల్లో ఎప్పుడైనా శరీరంలో సమస్యను గుర్తించవచ్చు. రెండో డోసు తీసుకున్న తర్వాత సమస్యలు పెద్దగా రాకపోవచ్చు. చాలా అరుదుగా మాత్రమే రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు వస్తాయి. మూడేండ్ల తర్వాత ఎలాంటి సమస్యలు రావు. నిశ్చింతగా ఉండొచ్చు.
జవాబు: వ్యాక్సిన్ వల్ల గుండెపోటు రావడం చాలా అరుదు. మెదడులో రక్తం గడ్డ కట్టే సమస్యలే వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కూడా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న తర్వాతనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండో డోసు తర్వాత సమస్య రావడం చాలా అరుదు. అలాంటిది ఏండ్ల తర్వాత రాదు. అందులోనూ గుండెపోటు రాదు. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వారు వెంటనే మరణించడం అన్నది జరగదు.
జవాబు: ఆరోగ్యకరమైన జీవన విధానాలను అనుసరించండి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోండి. వేళకు తినడం, నిద్రపోవడం ముఖ్యం. వ్యాయామం చేయండి. అంతేకాకుండా మనిషికి గుండెపోటు లేదా ఇతర సమస్యలకు ప్రధాన కారణం వ్యాక్సిన్ కాదు.. ధూమపానం.
జవాబు: వ్యాక్సిన్ వల్ల వచ్చే క్లాట్స్ను ప్లేట్లెట్లను పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. మనిషి రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య ఆధారంగా దీనిపై నిర్ధారణకు రావొచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నపుడు ప్లేట్లెట్లు తగ్గితే ఆందోళన చెందవచ్చు. ప్లేట్లెట్లు తగ్గి రక్తం గడ్డ కడుతుంటే అది వ్యాక్సిన్ వల్ల కలిగిన దుష్ప్రభావంగా గుర్తించవచ్చు.