హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తమ మెరుగైన ఫలితాలు సాధించినట్టు డిజిటల్ రెడీనెస్ సర్వేలో వెల్లడైంది. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేపాల్, ఎడెల్మ్యాన్ డాటా, ఇంటెలిజెన్స్ సంస్థల భాగస్వామ్యంతో గతేడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 250 మంది వ్యాపారుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆన్లైన్ వ్యాపారాలు, డిజిటల్ చెల్లింపులపై 52% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఇతరులు తమ వ్యాపారాలను కాపీ కొడుతున్నారని 65% మంది చెప్పారు.