హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 26: రేవంత్రెడ్డి ఓ బ్రోకర్.. ఉద్యమం చేసి సీఎం కాలేదు, బ్రోకరిజం చేస్తూ సీఎం అయ్యాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. శుక్రవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలో చేరితే పిచ్చి కుకల్లా రాళ్లతో కొట్టాలని సీఎం చెప్పారని, ఇప్పుడు కడియంను కొట్టాల్సిందే కదా? అని అడిగారు. రేవంత్, కడియం శ్రీహరిపై ఎవరైనా రాళ్లు వేయొచ్చని పేర్కొన్నారు. కడియం శ్రీహరి ఎస్సీ కాదని చెప్పిందే రేవంత్రెడ్డి అని తెలిపారు. కడియం శ్రీహరి ఎస్సీ కానప్పుడు కావ్య ఎలా ఎస్సీ అవుతారని, ఆమెకు వరంగల్ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మాల, మాదిగల నుంచి రేవంత్రెడ్డి ప్రతిఘటన ఎదురోక తప్పదని హెచ్చరించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నది బీజేపీ కాదని, రేవంత్రెడ్డేనని స్పష్టం చేశారు. ఎకడికెళ్లినా దేవుళ్ల పేర్ల మీద ఒట్టు వేస్తున్నాడని మండిపడ్డారు.