హైదరాబాద్, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ): అధికారులు ప్రజలకు జవాబుదారులుగా ఉంటూ, సమస్యల పరిషారమే లక్ష్యంగా విధులు నిర్వహించాలని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ఆదేశించారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో నిర్వహించిన 560 మంది మండల నోడల్ అధికారులైన ఎంపీడీవోల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా ప్రారంభం కానున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే విద్యాసాగర్, సీఎం కార్యాలయం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.