బంజారాహిల్స్, అక్టోబర్ 2: మున్నూరు కాపులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం లభిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఎర్రమంజిల్లో ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ.. మున్నూరు కాపుల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగుతుందని, ఐక్యతతోనే హక్కులను సాధించుకోగలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్, అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ సర్దార్ పుటం పురుషోత్తంరావు పటేల్, కోశాధికారి విష్ణు జగతి పటేల్, సంఘం నేతలు ఆర్వీ మహేందర్ పటేల్, ఉప్పు సత్యనారాయణ పటేల్, శ్రీనివాస్, రాజు, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.