హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ప్రకృ తి నియామాలను గౌరవిస్తే అడవి జంతువులతో కూడా జీవించవచ్చని ఎంపీ సంతోష్ తెలిపారు. పార్లమెంటరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులపై కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ సోమవారం గుజరాత్లో పర్యటించింది. ఎంపీలు సంతోష్, కొత్త ప్రభాకర్రెడ్డి ఇతర సభ్యులతో కలిసి స్టడీ టూర్లో భాగంగా గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. స్థానిక మల్ధారిస్ గిరిజనులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రకృతి నియమాలను గౌరవిస్తే అడవి జంతువులతో కూడా జీవించవచ్చని మాల్ధారిస్ గిరిజనుల వద్ద తెలుసుకున్నామని సంతోష్ చెప్పారు. మల్ధారిస్ సంచార జాతు లు, వారి సంస్కృతి పార్లమెంటరీ కమిటీని ఆకట్టుకున్నదని తెలిపారు. మల్ధారీలు జానపద పాటలను తమ భాషలో పాడుతున్నప్పుడు వారి ముఖాల్లో సంతోషం కనిపించిందని, ఇది కాదా రిఫ్రెష్ అంటే అని ట్విట్టర్ చేశారు.