హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): హరిత భారతదేశాన్ని సృష్టించేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ను కొనసాగిస్తామని గ్రీన్ ఇండియా వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు. పర్యావరణ రక్షణతోపాటు మొక్కలు నాటడం ద్వారా మన ప్రకృతిని కాపాడుకొనేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
గురువారం సంతోష్కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా ఎర్రవల్లిలోని నివాసంలో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సిల్వర్ ఓక్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజుతోపాటు సందర్భం ఏదైనా మొక్కలు నాటే సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, శ్రవణ్రెడ్డి, కిశోర్గౌడ్ తదితరులున్నారు.