MP Santhosh | తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు హెచ్చరించారు. స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదవగా.. ఆయన స్పందించారు. తాను ఎలాంటి కబ్జాకు పాల్పడలేదని.. తాను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇది రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసని.. 32 సంవత్సరాలుగా వివాదంలో లేని భూమి ఇప్పుడు ఎలా వివాదంలోకి వచ్చింది ? ప్రశ్నించారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానన్నారు. న్యాయపరమైన అంశాలుంటే ముందుగా నోటీసులు ఇవ్వాలని.. ఫోర్జరీ చేశానని నేరుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. మా పార్టీపై, నాపై రాజకీయ కక్షతో బురద జల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. వివాద ఇంటి స్థలం 1350 గజాలు అని పోలీసులు, మీడియా పేర్కొంటుందని.. తాను కొన్నది 904 గజాల ఇంటి స్థలం మాత్రమేనన్నారు. తాను షేక్పేటలో 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని 2016లో చట్టబద్దంగా కొనుగోలు చేశానని తెలిపారు.
రూ.3.81కోట్లు చెల్లించి బాజాప్తా సేల్ డీడ్ ద్వారా స్థలాన్ని కొనుగోలు చేశానని.. రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశాను కాబట్టి ఫోర్జరీ అనే మాటకు తావేలేదన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఈ స్థలంపై ఎలాంటి న్యాయవివాదం లేదని.. నాకు ఇంటి స్థలాన్ని అమ్మిన శ్యామ్సుందర్ 1992లో ఆ స్థలాన్ని కొనుగోలు చేశారన్నారు. తాను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణలు చేపట్టలేదని ఎంపీ తెలిపారు. శ్యామ్సుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయన్నారు. ఆ స్థలం గడిచిన 32 సంవత్సరాలుగా నాకు అమ్మిన వ్యక్తి, నా ఆధీనంలోనే ఉన్నాయని.. ఎలక్షన్ అఫిడవిట్లో స్థలం వివరాలను పేర్కొన్నట్లు వివరించారు.