పెద్దపల్లి : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రామగుండంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి ఎనిమిదవ ఇంక్లైన్ అబ్దుల్ కలాం స్టేడియంలో ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. స్థానిక నాయకులు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు కలిసి ఒకే చోట పది వేల మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కొలేటి దామోదర్, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్, సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరామ్, కార్పోరేషన్ కమిషనర్ ఉదయ్ కుమార్, పోలీస్ కమిషనర్ సత్యరాయణ పాల్గొన్నారు.