హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఎంతో అద్భుతమైన కార్యక్రమమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. తనకు మొకలు నాటడం అంటే చాలా ఇష్టమని, ఇప్పటికే అనేక సందర్భాల్లో మొకలు నాటానని చెప్పారు. వచ్చే హైదరాబాద్ పర్యటనలో గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొకలు నాటుతానని తెలిపారు. ఇంత నిస్వార్దమైన కార్యక్రమాన్ని అంకితభావంతో ముందుకు తీసుకుపోతున్న సంతోష్కుమార్ను రాష్ట్రపతి అభినందించారు.
రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్కుమార్ మంగళవారం హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. మొకల ప్రాధాన్యాన్ని తెలిపేలా రూపొందించిన వృక్షవేదం పుస్తకాన్ని రాష్ట్రపతికి అందించారు. గ్రీన్ ఇండి యా చాలెంజ్లో భాగంగా మొకలు నాటుతున్న విషయం తనకు కూడా తెలుసని రాష్ట్రపతి చెప్పారు. ప్రజోపయోగమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ను మరింత ఉధృతంగా ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి చొరవ, గ్రీన్ ఇండియా చాలెంజ్ పట్ల రాష్ట్రపతి చూపించిన అభిమానం అద్భుతమైన అనుభవమని, వారి ప్రేమకు సంతోష్కుమార్ ధన్యవాదాలు తెలిపారు.