హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : దశ మహా విద్యా స్వరూపాలలో ఒకటైన అత్యంత పవిత్రమైన రాజశ్యామలాదేవి ఆలయాన్ని హైదరాబాద్ కోకాపేటలో నిర్మించనున్నారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన ఈ ఆలయాన్ని శారదాపీఠం వారు నిర్మిస్తారు. వైజాగ్ తర్వాత తెలంగాణలో నిర్మించడం ఇదే తొలిసారి.
ఈ ఆలయ ఆవరణలో ఆదివారం గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్ జమ్మిమొక్కను నాటారు. పవిత్రమైన ప్రదేశంలో జమ్మి మొక్కను నాటే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జి కే వంశీధర్రావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, శ్రవణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.